News April 14, 2025

సంగారెడ్డి: ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

కలెక్టరేట్లో నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వచ్చేవారం నుంచి యధావిధిగా విధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

Similar News

News December 2, 2025

NGKL:జర్నలిస్టుల మహాధర్నాను విజయవంతం చేయాలి

image

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ DEC 3న HYD I&PR కమిషనర్ కార్యాలయం వద్ద TUWJ(IJU) ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని టెమా పాలమూరు జిల్లా కన్వీనర్ అహ్మద్ పాష పిలుపునిచ్చారు. అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. అక్రిడిటేషన్ పాలసీ ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని అన్నారు

News December 2, 2025

శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య

image

‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు <<18427442>>భారత్ సాయం<<>> అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘క్లిష్ట సమయంలో SLకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నట్లుగానే ఇప్పుడూ మద్దతునిస్తున్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.

News December 2, 2025

NRPT: పోస్టల్ బ్యాలెట్ పై అధికారులకు శిక్షణ

image

పోస్టల్ బ్యాలెట్ శిక్షణను అధికారులు వినియోగించుకుని ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో పోస్టల్ బ్యాలెట్ పై శిక్షణ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారుల పోస్టల్ బ్యాలెట్ వినియోగం, లెక్కింపు తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.