News January 27, 2025

సంగారెడ్డి: ప్రధాన సమస్యలపై తీర్మానాల ఆమోదం: సీపీఎం

image

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర మహాసభలో చర్చించి పలు కీలక అంశాలపై తీర్మానాలను ఆమోదించామని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, మల్లు లక్ష్మి తెలిపారు. సంగారెడ్డిలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణం(గోకుల్ గార్డెన్)లో జరుగుతున్న రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా మీడియా పాయింట్‌లో చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాలుగు రోజులపాటు ప్రధాన అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు.

Similar News

News October 16, 2025

KNR: ‘మెటా ఫండ్‌’ పేరుతో ఆన్‌లైన్‌ కాయిన్‌ మోసం

image

మెటా ఫండ్ పేరుతో నకిలీ ఆన్‌లైన్ కాయిన్ యాప్‌ను సృష్టించి, అధిక లాభాలు ఆశచూపి ప్రజల నుంచి సుమారు రూ.25-30 కోట్ల వరకు పెట్టుబడులు వసూలుచేసి మోసంచేసిన కేసులో ప్రధాన నిందితుడు HYD మల్కాజిగిరికి చెందిన వరాల లోకేశ్వర్‌రావును పోలీసులు అరెస్టుచేశారు. సాఫ్ట్‌వేర్ నైపుణ్యమున్న లోకేశ్వర్‌రావు.. ఐదుగురితో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు CP తెలిపారు. నిందితుడి నుంచి GMWకారు, 30 తులాలబంగారం స్వాధీనం చేసుకున్నారు.

News October 16, 2025

జూబ్లీహిల్స్: ఉప ఎన్నికలో కొత్తగా 16 నామినేషన్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 16 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం వెల్లడించారు. నాలుగు రోజుల్లో 46 మంది క్యాండిడేట్లు దరఖాస్తు చేయగా.. మొత్తం 56 నామినేషన్లు దాఖలు అయ్యాయని పేర్కొన్నారు.

News October 16, 2025

పల్నాడు: సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు తాత్కాలిక విరామం

image

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు తాత్కాలిక విరామం లభించింది. ప్రభుత్వంతో గురువారం జరిగిన చర్చలు ఫలించాయి. శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్తో జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయాన్ని ఐక్యవేదిక నేతలు ప్రకటించారు. పదోన్నతులపై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి కూడా హామీ లభించినట్లు ఉద్యోగులు తెలిపారు.