News March 13, 2025

సంగారెడ్డి: ఫస్టియర్ పరీక్ష.. 97.42% హాజరు

image

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.16,290 మంది విద్యార్థులకు గాను 15,869 మంది విద్యార్థులు హాజరయ్యారని, 421 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Similar News

News October 16, 2025

5,346 టీచర్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఢిల్లీలో 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు DSSSB దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/

News October 16, 2025

జగిత్యాల: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాఖాపూర్ గ్రామంలో వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందాడు. యువకుడు తనుగుల శివ(32) ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్నిరోజులుగా మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 16, 2025

వేపాకుల కండిషనర్‌తో చుండ్రుకు చెక్

image

అమ్మాయిలకు జుట్టే అందం. ఒత్తయిన వెంట్రుకల కోసం ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి బదులు ఇంట్లోనే వేపాకులతో తయారుచేసుకున్న హెయిర్ కండిషనర్ మేలంటున్నారు నిపుణులు. ‘వేపాకులను నీళ్లలో మరిగించి గుజ్జుగా చేసి కాస్త తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు స్మూత్‌గా మారుతుంది. చుండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం, రాలిపోవడమూ తగ్గుతుంది’ అని చెబుతున్నారు.<<-se>>#HairCare<<>>