News January 31, 2025
సంగారెడ్డి: ఫిబ్రవరి 1 నుంచి పోలీస్ యాక్ట్

ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లాలో పోలీస్ చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 6, 2025
రేషన్ షాపుల్లో రూ.18కే గోధుమ పిండి: నాదెండ్ల

AP: జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘2400 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నాం. కిలో రూ.18 చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తాం. నవంబర్లో వర్ష సూచన నేపథ్యంలో కౌలు రైతులకు ఉచితంగా 50 వేల టార్పాలిన్లు ఇస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఏర్పాట్లు చేశాం. సెలవుంటే తర్వాత రోజు పడతాయి’ అని తెలిపారు.
News November 6, 2025
హన్వాడ: జాతర ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

కురుమూర్తి జాతరకు వెళ్లడానికి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వలేదని విజయ్ (15) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సల్లోనిపల్లిలో చోటుచేసుకుంది. పొలం పనులు ఉన్నాయని ఇంట్లో వారు చెప్పడంతో క్షణికావేశంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. శ్రీనివాసులు కుమారుడైన విజయ్ స్నేహితులతో జాతరకు వెళ్లాలనుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.
News November 6, 2025
తడిసిన ధాన్యం కొంటాం: ఢిల్లీరావు

AP: 17% వరకు తేమ ఉన్న ధాన్యాన్నీ కొంటామని సివిల్ సప్లై కార్పొరేషన్ MD ఢిల్లీరావు రైతులకు హామీ ఇచ్చారు. వివిధ రైతు సంఘాల నేతలు ఆయన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా గోనె సంచులు, రవాణా ఖర్చులివ్వాలని రైతులు కోరారు. మిల్లర్ల యాజమాన్యాల నుంచి వేధింపులను అడ్డుకోవాలన్నారు. పంటనష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, తేమశాతం అంచనాపై సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఢిల్లీరావు రైతులకు తెలిపారు.


