News March 6, 2025

సంగారెడ్డి: ఫ్రీ ఫైనల్ పరీక్షలకు శాంపిల్ ఓఎంఆర్ షీట్: DEO

image

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రీ ఫైనల్ పరీక్షల్లో శాంపిల్ ఓఎంఆర్ షీట్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి నుంచి ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇంగ్లీష్, గణితం పాఠ్యాంశాలకు ఓఎంఆర్ షీట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. DCEB కార్యదర్శి లింభాజీ పాల్గొన్నారు.

Similar News

News March 6, 2025

HYD: ORRపై యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

image

రావిర్యాల ORR ఎగ్జిట్ 13 వద్ద యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల సమాచారం.. ORRపై చెట్లకు నీళ్లు పడుతున్న సిబ్బందిని కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కార్ డ్రైవర్, కోప్యాసింజర్, ఫ్లాగ్ మ్యాన్ మృతిచెందారు. ఘట్కేసర్ వద్ద 3:15కు కార్ ఎంట్రీ అవ్వగా.. 3:30కి యాక్సిడెంట్ జరిగిందని, 15 MINలో దాదాపు 37 కి.మీ చేరుకునేంత ఓవర్ స్పీడ్‌లో వచ్చాడని అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

చికిత్స పొందుతూ రెండో విద్యార్థి కూడా మృతి

image

పుత్తూరు మండలం నేషనూరు గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి రవితేజ(17) మృతి చెందగా మరో విద్యార్థి మునికుమార్(18) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం చికిత్స పొందుతూ ముని కుమార్ కూడా మృతి చెందాడు. విద్యార్థులు కాలేజీకి బైకు మీద వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. చనిపోయిన ఇద్దరూ అన్న దమ్ములు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

News March 6, 2025

నుజ్జునుజ్జయిన మారుతి సుజుకీ కారు.. సేఫ్టీ ఎక్కడ?

image

హైదరాబాద్ ORRపై జరిగిన కారు ప్రమాదపు ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో మారుతి సుజుకీ బ్రెజా కారు నుజ్జునుజ్జయి ఇద్దరు చనిపోయారు. ఈ మోడల్ కారు 5కు 4 Global NCAP rating సాధించినా ఇంతలా డ్యామేజ్ అవ్వడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. మైలేజీ కోసం చూసుకుని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కంపెనీ సైతం వినియోగదారుల ప్రాణాలను లెక్కచేయట్లేదని విమర్శలొస్తున్నాయి.

error: Content is protected !!