News March 6, 2025
సంగారెడ్డి: ఫ్రీ ఫైనల్ పరీక్షలకు శాంపిల్ ఓఎంఆర్ షీట్: DEO

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రీ ఫైనల్ పరీక్షల్లో శాంపిల్ ఓఎంఆర్ షీట్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి నుంచి ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇంగ్లీష్, గణితం పాఠ్యాంశాలకు ఓఎంఆర్ షీట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. DCEB కార్యదర్శి లింభాజీ పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్➤ నంద్యాల: ఫరూక్ సతీమణి చివరి కోరిక.. HYDలోనే అంత్యక్రియలు➤ ఉమ్మడి జిల్లా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13కు వాయిదా➤ మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం➤ కర్నూలులో TDP నేత దారుణ హత్య.. ఎస్పీ వివరాల వెల్లడి ➤ కర్నూలులో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు➤ మంత్రాలయం: పల్లెల్లో దాహం కేకలు..!➤ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
News March 21, 2025
MNCL: పరీక్షకు 20 మంది గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఈఓ యాదయ్య తెలిపారు. 49 పరీక్షా కేంద్రాల్లో రెగ్యూలర్ విద్యార్థులు 9,183 మందికి గాను 9,163 మంది హాజరయ్యారని, 20 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. సప్లీలు రాసే ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు హాజరయ్యారు. కాగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు.
News March 21, 2025
నాగర్కర్నూల్: 26న పురుషులకు కుటుంబ నియంత్రణ ప్రత్యేక చికిత్స

పురుషులకు ఎలాంటి కొట్టు కోత లేకుండా N.S.V ఆపరేషన్ (నో స్కావెల్ వేసక్టమీ) ప్రత్యేక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరం నాగర్ కర్నూల్ జిల్లా సాధారణ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని మెడికల్ డాక్టర్ మధు ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ చేసుకోదలిచే మగవారు తమతో ఆధార్ కార్డుని వెంట తీసుకురావాలని, వివరాలకు ఆరోగ్య కార్యకర్త నంబర్కు 9014932408ను సంప్రదించాలన్నారు.