News June 30, 2024
సంగారెడ్డి: బాధ్యతలు స్వీకరించిన ఓడిఎఫ్ సీజీఎం
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం (ఓడిఎఫ్)చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర ప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగుల సహకారంతో ఆయుధ కర్మాగారం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Similar News
News October 2, 2024
సంగారెడ్డిలో దారుణం.. అన్నను చంపిన తమ్ముడు
సంగారెడ్డి పట్టణంలోని నాల్ సాబ్ గుడ్డలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. మద్యం మత్తులో అన్నషాహిద్(46)ను తమ్ముడు రఫిక్ (40) కల్లు సీసాతో కొట్టి హత్య చేశాడు. తనను, తన భార్యను అన్న సూటిపోటి మాటలతో బాధించేవాడని హంతకుడు రఫిక్ తెలిపారు. పోలీసులు రఫిక్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
News October 2, 2024
MDK: మాంసం విషయంలో తగ్గేదే లేదంటున్నా జనం.!
బుధవారం పెత్రమాస అవడంతో ప్రజలు కౌసుపై మక్కువ చూపుతారు. కానీ ఈ సంవత్సరం పెత్రమాసతో పాటు గాంధీ జయంతి రావడంతో అధికారులు జీవహింస చేయరాదని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఉ.4 గంటలకు మటన్ షాపులు ఓపెన్ చేసి మటన్ అమ్మారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉ.3 గంటలకె మేకలు, గొర్రెలను కోశారు. పెద్దలకు నైవేద్యంగా పెట్టే మాంసాన్ని ఆచార సంప్రదాయాన్ని మరువలేమని పలువురు అన్నారు.
News October 2, 2024
MDK: పల్లెల్లో బతుకమ్మ పండుగ సందడి
ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఈరోజు పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు హాస్టల్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీగా ఏర్పడింది. గ్రామాల్లో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తంగేడు, గునుగు, వివిధ రకాల పూల సేకరణలో నిమగ్నమయ్యారు.