News March 2, 2025

సంగారెడ్డి: బాలింత మృతితోఆందోళన.. కేసు నమోదు.!

image

వైద్యుల నిర్లక్ష్యంతో <<15621244>>బాలింత మృతి<<>> చెందిందని బాధిత కుటుంబీకులు ఆందోళన చేశారని సంగారెడ్డి ఎస్‌ఐ పి.రవీందర్ అన్నారు. ఎస్‌ఐ వివరాలు.. కోహీర్ మండలం మద్రికి చెందిన గర్భిణీ మహానందిని ప్రసవానికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవంలో ఆడ శిశువు పుట్టగా, బాలింత మృతి చెందింది. భర్త నవీన్, కుటుంబీకులు కన్నీళ్ల పర్యంతమై ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 28, 2025

తుఫానుపై ఏలూరు జిల్లా పోలీస్ అప్రమత్తం

image

తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే పోలీసుల కర్తవ్యం అని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. జిల్లా ప్రజల కోసం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. రెస్క్యూ టీమ్‌లు, డ్రోన్లను వినియోగిస్తాయని, అత్యవసరమైతే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, తద్వారా తక్షణ సహాయం అందుతుందని ఆయన సూచించారు.

News October 28, 2025

కుప్పకూలిన విమానం.. 12 మంది సజీవదహనం

image

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయి మంటలు వ్యాపించడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. ఇవాళ ఉదయం టూరిస్టులతో డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తుండగా సింబా గోలిని ఏరియాలో కుప్పకూలినట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. పోలీసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

News October 28, 2025

మొంథా తుఫాన్ హెచ్చరికలు ఆందోళనలో రైతాంగం

image

మొంథా తుఫాన్ ప్రభావ హెచ్చరికలతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతు కావలసిన ఏర్పాట్లను తక్షణమే చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేయగా ఇప్పటికే 35% వరకు వరి కోతలు పూర్తికావస్తున్నాయి.