News March 2, 2025

సంగారెడ్డి: బాలింత మృతితోఆందోళన.. కేసు నమోదు.!

image

వైద్యుల నిర్లక్ష్యంతో <<15621244>>బాలింత మృతి<<>> చెందిందని బాధిత కుటుంబీకులు ఆందోళన చేశారని సంగారెడ్డి ఎస్‌ఐ పి.రవీందర్ అన్నారు. ఎస్‌ఐ వివరాలు.. కోహీర్ మండలం మద్రికి చెందిన గర్భిణీ మహానందిని ప్రసవానికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవంలో ఆడ శిశువు పుట్టగా, బాలింత మృతి చెందింది. భర్త నవీన్, కుటుంబీకులు కన్నీళ్ల పర్యంతమై ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 28, 2025

KNR: BC కోటా.. ఎవరికి వారే యమునా తీరే..!

image

BC రిజర్వేషన్ల సాధనలో రాష్ట్రంలోని BC సంఘాల నేతల మధ్య ఐక్యత కొరవడింది. సమష్టిగా ఉద్యమిస్తే పంచాయతీ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసేదన్న అభిప్రాయం BCల్లో వ్యక్తమవుతోంది. కాగా క్రెడిట్ కోసమే BC సంఘాలు వేర్వేరుగా ముందుకెళ్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. అటు కృష్ణయ్య, ఇటు జాజుల శ్రీనివాస్.. ఎవరి JAC వారే పెట్టుకొని GO 46పై ఉద్యమించాలని పిలుపునిచ్చినా ఉమ్మడి KNR BC నేతలెవ్వరూ పట్టించుకోవట్లేదు.

News November 28, 2025

ఏర్పేడు: రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్-01 పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/advt_712025/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 10.

News November 28, 2025

బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.