News February 17, 2025
సంగారెడ్డి: బీమా డబ్బుల కోసం బావనే చంపేశాడు

బీమా డబ్బులకు ఆశపడి అక్క భర్తనే చంపేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్(42) పదేళ్ల క్రితం ఉపాధికోసం అమీన్పూర్కు వచ్చాడు. బామ్మర్ది నరేశ్ నాయక్తో కలిసి ఫైనాన్స్లో జేసీబీ కొనగా దానికి నెల క్రితం పోస్టల్ బీమా చేయించారు. కాగా బావ చనిపోతే బీమా డబ్బుతోపాటు లోన్ క్లియర్ అవుతుందని దురాశపడ్డ సురేశ్ ఈనెల 14న మేనమామ దేవీసింగ్తో కలిసి హత్య చేశారు.
Similar News
News November 26, 2025
కన్నీటి నివాళి: ‘అమ్మే మా వెన్నెముక’

కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచిన <<18391262>>అమ్మ<<>> రత్నమ్మ (83) ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం భారంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటలతో చెప్పలేనంత గొప్పవని అన్నారు. అమ్మ లేకపోవడం మాటల్లో చెప్పలేని పెద్ద లోటుగా మిగిలిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
News November 26, 2025
ప.గో జిల్లా.. భారీ వర్షాలు.. హెచ్చరిక

ప.గో జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.
News November 26, 2025
విలీనం ఎఫెక్ట్.. GHMC ఎన్నికలు ఆలస్యం?

GHMC ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న కార్పొరేటర్లు మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014-16 మధ్య రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారులతో గ్రేటర్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది. ప్రస్తుతం 27 ULBలను విలీనానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో అన్నీ సర్దుబాటు అయ్యేవరకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టేలా ఉంది. ఫిబ్రవరి 10తో పాలకవర్గం ముసిగినా.. ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.


