News February 17, 2025
సంగారెడ్డి: బీమా డబ్బుల కోసం బావనే చంపేశాడు

బీమా డబ్బులకు ఆశపడి అక్క భర్తనే చంపేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్(42) పదేళ్ల క్రితం ఉపాధికోసం అమీన్పూర్కు వచ్చాడు. బామ్మర్ది నరేశ్ నాయక్తో కలిసి ఫైనాన్స్లో జేసీబీ కొనగా దానికి నెల క్రితం పోస్టల్ బీమా చేయించారు. కాగా బావ చనిపోతే బీమా డబ్బుతోపాటు లోన్ క్లియర్ అవుతుందని దురాశపడ్డ సురేశ్ ఈనెల 14న మేనమామ దేవీసింగ్తో కలిసి హత్య చేశారు.
Similar News
News November 16, 2025
BHPL: ఇందిరమ్మ ఇల్లు నిలుపుదలపై హైకోర్టులో రిట్ పిటిషన్

కక్షపూరితంగా ఇందిరమ్మ ఇల్లు నిలిపివేశారని ఆరోపిస్తూ BHPL జిల్లా గోరి కొత్తపల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఓ మహిళ న్యాయపోరాటానికి సిద్ధమైంది. అన్ని అర్హతలున్నా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అధికారులు ఇల్లు ప్రొసీడింగ్ కాపీని నిలిపివేశారని, దానికి సమాధానం చెప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా కారణం తెలుసుకున్న ఆ మహిళ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
News November 16, 2025
KNR: NH-563లో ఇదేం ఇంజినీరింగ్..?

NH-563 ఫోర్ లైన్ నిర్మాణంలో ప్రణాళిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల వద్ద అండర్ పాస్లు గుర్తించకపోవడం, దీంతో ప్రజలు ఆందోళనలకు దిగడంతో ఇంజినీరింగ్ లోపాలు బయటపడ్డాయి. ఈ కారణంగా ప్లాన్ మార్చాల్సిన పరిస్థితి రావడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. 68 కి.మీ.ల రోడ్డు నిర్మాణంలో 9 మేజర్ బ్రిడ్జిలు, 20 మైనర్ బ్రిడ్జిలు, 189 కల్వర్టులు, 51 జంక్షన్లు నిర్మించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
News November 16, 2025
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

కోల్కతాలో టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 55* పరుగులతో రాణించారు. జడేజా 4, కుల్దీప్, సిరాజ్ చెరో 2, బుమ్రా, అక్షర్ ఒక్కో వికెట్ తీశారు. ఈ టెస్టులో భారత్ గెలవాలంటే 124 రన్స్ చేయాలి.


