News February 17, 2025
సంగారెడ్డి: బీమా డబ్బుల కోసం బావనే చంపేశాడు

బీమా డబ్బులకు ఆశపడి అక్క భర్తనే చంపేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్(42) పదేళ్ల క్రితం ఉపాధికోసం అమీన్పూర్కు వచ్చాడు. బామ్మర్ది నరేశ్ నాయక్తో కలిసి ఫైనాన్స్లో జేసీబీ కొనగా దానికి నెల క్రితం పోస్టల్ బీమా చేయించారు. కాగా బావ చనిపోతే బీమా డబ్బుతోపాటు లోన్ క్లియర్ అవుతుందని దురాశపడ్డ సురేశ్ ఈనెల 14న మేనమామ దేవీసింగ్తో కలిసి హత్య చేశారు.
Similar News
News March 25, 2025
ఈ IPL సీజన్లో వారిదే హవా..!

IPL 2025లో జట్లు మారిన ఆటగాళ్లు చెలరేగుతున్నారు. ఇప్పటివరకు 4 మ్యాచులు జరగ్గా అన్నిట్లోనూ ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లే POTMగా నిలిచారు. వీరిలో కృనాల్ పాండ్య (RCB), ఇషాన్ కిషన్ (SRH), నూర్ అహ్మద్ (CSK), అశుతోశ్ శర్మ (DC) ఉన్నారు. గత సీజన్లో వీరు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సీజన్లో జట్టు మారగానే విధ్వంసం సృష్టిస్తున్నారు. స్టార్ ప్లేయర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నారు.
News March 25, 2025
సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల పిటిషన్పై విచారణ

TG: BRS MLA పాడి కౌశిక్ వేసిన పార్టీ ఫిరాయింపుల పిటిషన్పై SCలో విచారణ మొదలైంది. కౌశిక్ తరఫున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ‘ముగ్గురు MLAలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్ పట్టించుకోలేదు. సుప్రీం జోక్యం చేసుకున్న తర్వాతే నోటీసు ఇచ్చారు. వాటిపై ఎమ్మెల్యేలు వారంలో సమాధానం ఇవ్వాలి. కానీ ఇప్పటికి 3 వారాలైనా వారు స్పందించడంలేదు’ అని జడ్జి జస్టిస్ గవాయ్ దృష్టికి తీసుకెళ్లారు.
News March 25, 2025
బెట్టింగ్ యాప్ కేసులో కొత్త మలుపు

నిషేధిత బెట్టింగ్ యాప్స్ <<15822419>>కేసులో<<>> కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులని కూడా నిందితులుగా చేర్చారు. సెలబ్రిటీలను విచారించే ముందు పోలీసులు న్యాయసలహా తీసుకోనున్నారు. తొలుత యాప్ నిర్వాహకులను విచారించనున్నారు. తెలంగాణ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని ముందుగా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం యాప్ల నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.