News February 11, 2025

సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

బీసీ స్టడీ సర్కిల్‌లో ఆర్ఆర్ బీ, ఎస్ఎస్సీ, ఉచిత శిక్షణ కోసం 181 మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ తేదీ వరకు స్టడీ సర్కిల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. 15 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..

Similar News

News November 5, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: BJP కోసం పవన్‌?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరపడింది. ప్రచారానికి కేవలం 4 రోజులు సమయం ఉంది. చివరి ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అందుకే అభ్యర్థులు, పార్టీల అగ్ర నాయకులు ప్రచారం జోరుగా చేస్తున్నారు. BJP తరఫున ప్రచారం చేయనున్నారని జనసేన తెలంగాణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ తెలిపారు. TBJP నేతలతో సమావేశమైన ఆయన ఈ విషయం తెలిపారు. APలో BJP, జనసేన, TDP కూటమిగా ప్రభుత్వం నడుపుతున్న నేపథ్యంలో పవన్ ప్రచారం చేయనున్నారు.

News November 5, 2025

వర్జీనియా LGగా హైదరాబాదీ మహిళ

image

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ(డెమోక్రాట్) విజయం సాధించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. హష్మీ 1964లో HYDలో జన్మించారు. మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో నివసించారు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జార్జియాకు వెళ్లి స్థిరపడ్డారు. బీఏ ఆనర్స్, సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. 1991లో రిచ్‌మండ్‌కు వెళ్లిన ఆమె 30 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.

News November 5, 2025

ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం: వైసీపీ

image

ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైసీసీ X ఖాతాలో పేర్కొంది. మద్యం తాగించి..లైంగిక దాడికి పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు వైసీసీ ట్వీట్ చేసింది. ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందనేది తెలియాల్సి ఉంది.