News February 11, 2025
సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

బీసీ స్టడీ సర్కిల్లో ఆర్ఆర్ బీ, ఎస్ఎస్సీ, ఉచిత శిక్షణ కోసం 181 మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ తేదీ వరకు స్టడీ సర్కిల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. 15 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..
Similar News
News October 17, 2025
నేటి నుంచి ఉచితంగా చేప పిల్లల పంపిణీ

TG: రాష్ట్రవ్యాప్తంగా మత్య్సకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ నేడు ప్రారంభం కానుంది. 88 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం అందించనుంది. 32 జిల్లాల్లోని 46వేల చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పెంచేందుకు వీలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకు రూ.123 కోట్లు ఖర్చు చేస్తోంది. మక్తల్లో మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
News October 17, 2025
భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇవాళ HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. ఏడు రోజుల్లో రూ.9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 17, 2025
WGL: భారీగా పడిపోయిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు శుక్రవారం రైతన్నలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. రెండు నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధర భారీగా పడిపోయింది. నేడు క్వింటా పత్తి ధర రూ.6,860 పలికింది. మంగళవారం రూ.6,960, బుధవారం రూ.6,940, గురువారం రూ. 6,930 ధరలు పలికాయి. ధరలు పడిపోవడం అన్నదాతలను నిరాశకు గురి చేస్తున్నాయి.