News February 11, 2025

సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

బీసీ స్టడీ సర్కిల్‌లో ఆర్ఆర్ బీ, ఎస్ఎస్సీ, ఉచిత శిక్షణ కోసం 181 మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ తేదీ వరకు స్టడీ సర్కిల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. 15 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..

Similar News

News March 22, 2025

నెల్లూరు: బాలికపై లైంగిక వేధింపులు.. ఐదేళ్ల జైలు శిక్ష

image

బాలికపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం చేశాడన్న కేసులో నేరం రుజువు కావడంతో వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానాను జిల్లా పొక్సో కోర్టు స్పెషల్ జడ్జి సిరిపిరెడ్డి సుమ విధించారు. వింజమూరు మండలానికి చెందిన బాలిక 2013 మే 6న కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా.. కృష్ణ అనే వ్యక్తి లైగింక దాడికి పాల్పడగా..వ్యతిరేకించడంతో బావిలోకి తోసేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా శిక్ష పడింది.

News March 22, 2025

అనకాపల్లి నేటి నుంచి కేజీబీవీల్లో దరఖాస్తుల స్వీకరణ

image

అనకాపల్లి జిల్లాలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఆర్ జయ ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు 7,8,9 తరగతులు ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో 20 విద్యాలయాల్లో 1600 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

News March 22, 2025

6గ్యారంటీలకు రూ.56 వేల కోట్లు: Dy.CM

image

BRS పాలనలో రాష్ట్ర GST వృద్ధి రేటు 8.54 శాతంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది 12.3 శాతానికి పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆరు గ్యారంటీల కోసం మాత్రమే రూ.56 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, బడ్జెట్‌ను సవరించి, నిజమైన లెక్కలనే ప్రజలకు వెల్లడించామన్నారు.

error: Content is protected !!