News August 6, 2024
సంగారెడ్డి: భారీగా బంగారం స్వాధీనం, వ్యక్తి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ జాతీయ రహదారిపై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారం పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని సుమారు 4.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. చంద్రేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News October 15, 2025
మెదక్: నేటి నుంచి 1,52,524 పశువులకు టీకాలు

పశువులకు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య కోరారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,52,524 పశువులు ఉండగా అందులో 48,909 ఆవులు, 1,03,615 గేదెలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 46 బృందాలుగా ఏర్పడి వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు అన్ని గ్రామాల్లో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నామన్నారు.
News October 15, 2025
మెదక్: సీఎం కప్ విధుల కోసం దరఖాస్తు చేసుకోండి

సీఎం కప్ -2025లో విధులు నిర్వహించేందుకు మెదక్ జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన పీడీ/పీఈటీలు, జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల సేవలను వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ప్రొ.రాధాకిషన్ సూచించారు. వివరాలను జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 9493594388, 7396313714 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News October 15, 2025
రామాయంపేట: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొలిపర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ(40) కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.