News March 6, 2025
సంగారెడ్డి: మండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: బీజేపీ

పట్టభద్రులు, ఉపాధ్యాయులు నమ్మకంతో బీజేపీ అభ్యర్థులు గెలిపించారని, ఈ గెలుపుతో శాసన మండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రెండు స్థానాలు గెలిపించిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు.
Similar News
News March 6, 2025
ప్రభాస్కు గాయం? టీమ్ ఏం చెప్పిందంటే..

స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయమైందని, కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్లకు దూరమవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్కు ఎలాంటి గాయం కాలేదని, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరింది. కాగా ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడటంతో తీవ్ర గాయమైందని, ఇటలీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పలు సైట్లు వార్తలు ప్రచురించాయి.
News March 6, 2025
రోడ్డు ప్రమాదాలకు ఇంజినీర్లే కారణం: గడ్కరీ

రోడ్డు ప్రమాదాలకు సివిల్ ఇంజినీర్ల తప్పులే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీపీఆర్, రోడ్డు డిజైన్లు సరిగా చేయట్లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్స్ లాంటి చిన్న పనులు కూడా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనం స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
News March 6, 2025
తాడేపల్లిలో వైఎస్సార్టీయూసీ క్యాలెండర్ ఆవిష్కరణ

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్టీయూసీ క్యాలెండర్, డైరీ 2025ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైఎస్సార్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాస్, విశాఖ జిల్లా అధ్యక్షుడు అనీల్కుమార్, రాజారెడ్డి ఉన్నారు.