News April 13, 2025
సంగారెడ్డి: మహిళపై అత్యాచారం

ఫోన్లో పరిచయమైన ఓ వ్యక్తి మహిళను అత్యాచారం చేసిన ఘటన వట్ పల్లిలో శనివారం జరిగింది. ఎస్ఐ విఠల్ వివరాలు.. మండలంలోని పల్వట్లకు చెందిన ఓ వివాహిత(35)తో ఫోన్లో పరిచయం పెంచుకున్న వ్యక్తి జోగిపేటకు వచ్చిన ఆమెను అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ సమీపంలో పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మహిళ మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News November 19, 2025
మెదక్: తండ్రి దాడిలో గాయపడ్డ వంశీని పరామర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ కేంద్రంలో చికిత్స పొందుతున్న వంశీని కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో మద్యం మత్తులో తండ్రి కొడుకు వంశీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీ వద్దకు వెళ్లి కలెక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.
News November 19, 2025
పుట్టపర్తిలో ఐశ్వర్యారాయ్

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. అబ్బీ వి, అంతరా నంది ‘సత్యం శివం సుందరం’తో సహా పలు భక్తి గీతాలను ఆలాపించి భక్తుల్ని మైమరపింపజేశారు. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, గాయకుడు హరిహరన్, డ్రమ్స్ శివమణి, మాజీ సీజేఐ NV రమణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
News November 19, 2025
సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.


