News January 30, 2025
సంగారెడ్డి: మాదకద్రవ్యాల నిర్మూలన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు: ఎస్పీ

మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 100కు వచ్చే కాల్స్ సత్వర పరిష్కారం కోసం 20 ట్యాబ్లు వచ్చినట్లు చెప్పారు. ట్రాఫిక్ చర్యలో భాగంగా 10 బ్రీత్ అనలైజర్, 5 కెమెరాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
గద్వాల్: ఎయిడ్స్ బాధితుల హక్కులపై అవగాహన

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ.. హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తులపై వివక్ష, మానసిక వేధింపులు గురించి వివరించారు.
News December 1, 2025
ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి కేశవ్

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదిగవి గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. గంటపాటు విద్యార్థులకు పాఠం చెప్పారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల తెలివితేటలను చూసిన మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలలో అధిరోహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
News December 1, 2025
గద్వాల్: ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాదు నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో సమావేశం నిర్వహించారు. గద్వాల కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, నామినేషన్ల పరిశీలన జరిగిందన్నారు.


