News January 30, 2025
సంగారెడ్డి: మాదకద్రవ్యాల నిర్మూలన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు: ఎస్పీ

మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 100కు వచ్చే కాల్స్ సత్వర పరిష్కారం కోసం 20 ట్యాబ్లు వచ్చినట్లు చెప్పారు. ట్రాఫిక్ చర్యలో భాగంగా 10 బ్రీత్ అనలైజర్, 5 కెమెరాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 2, 2025
చెన్నేకొత్తపల్లి: హైవేపై ప్రమాదం.. ఒకరి మృతి

చెన్నేకొత్తపల్లి మండలం కేంద్రం సమీపాన కోణ క్రాస్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రావుల సోమశేఖర్ అనే యువకుడు బైకుపై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీకేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.
News November 2, 2025
HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 2, 2025
మోదీ యోగా చేస్తే.. అదానీ, అంబానీ డాన్స్ చేస్తారు: రాహుల్

ఓట్ల కోసం ప్రధాని మోదీ డ్రామా ఆడుతున్నారని, ఎన్నికల తర్వాత హామీలను నెరవేర్చరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఓట్ల కోసం PM యోగా చేయమన్నా చేస్తారు. కొన్ని ఆసనాలు వేస్తారు. కానీ ఎన్నికలయ్యాక సింగింగ్, డాన్సింగ్ అంతా అదానీ, అంబానీ చేస్తారు. ఇదంతా ఓ నాటకం’ అని ఆరోపించారు. ట్రంప్కు మోదీ భయపడుతున్నారని, కొందరు పారిశ్రామికవేత్తలు ఆయన్ను నియంత్రిస్తున్నారని బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.


