News March 20, 2025

సంగారెడ్డి: ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు

image

జిల్లాలో ఈనెల 5న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టులకు 15,412 మందికి 15,030 మంది విద్యార్థులు హాజరయ్యారు. 97.52 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 22, 2025

వనపర్తి జిల్లా కలెక్టర్ WARNING

image

అనుమతిలేని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31 వరకు ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ చేయించుకునే వారికి 25 శాతం రాయితీ ఇస్తామన్నారు. గడువు ముగిసిన తర్వాత అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

News March 22, 2025

KMR: ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీపై విస్తృత ప్రచారం: కలెక్టర్

image

ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీపై విస్తృత ప్రచారం చేస్తున్నామని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. LRS పై రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నామని, ఈ నెల 31 వరకు 25% రాయితీ వర్తిస్తుందని ప్రజలకు వివరిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

News March 22, 2025

ధర్మపురి: అగ్ని జ్వాలలో లక్ష్మీనరసింహస్వామి దివ్య రూపం!

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో సుదర్శన నారసింహ హోమ పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిజ్వాలలో నరసింహస్వామి అపురూప దృశ్యం దర్శనమిచ్చింది. అగ్నిజ్వాలలో లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీకు లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.

error: Content is protected !!