News March 28, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన తల్లి..

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు ఓ తల్లి విషం ఇచ్చి తానూ సేవించింది. కాగా, విషం తాగిన తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతులు.. గౌతమ్(8), సాయికృష్ణ(12), మధుప్రియ(10). మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 14, 2025

ఒక రౌండ్ అంటే ఏమిటి?

image

ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజున ‘రౌండ్’ అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. X అనే వ్యక్తి మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు అని వింటాం. ఒక రౌండ్ అంటే 14 EVMల ఓట్ల లెక్కింపు. ప్రతి EVM ఒక బూత్‌ను సూచిస్తుంది. కాబట్టి ఒక రౌండ్ 14 బూత్‌ల ఓట్ల లెక్కింపు అని కూడా చెప్పొచ్చు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం EC ఒకేసారి 14 టేబుళ్లను ఉంచుతుంది. ఒక్కో టేబుల్‌పై ఒక EVM ఉంటుంది.

News November 14, 2025

GNT: బాధితులలో ఎక్కువ శాతం నగరవాసులే

image

ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహించబడుతుంది. మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి మందు ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిపిన అధ్యయనాలు ప్రకారం టైప్ 2 డయాబెటిస్ గ్రామీణ ప్రాంతంలో సుమారు 6.5% ఉంటే, నగరవాసులలో 21% కంటే ఎక్కువ ఉన్నట్లు అంచనా. బాధితులలో ఎక్కువ శాతం 25-55 ఏళ్ల వయసు వారే.

News November 14, 2025

అలసంద సాగు..అధిక దిగుబడినిచ్చే విత్తనం ఇదే

image

అలసంద 85 నుంచి 90 రోజుల పంట. దీనికి చల్కా, ఎర్రనేలలు ఈ పంటకు అనుకూలం. అన్ని కాలాల్లో విత్తుటకు టి.పి.టి.సి-29 అనే విత్తన రకం అనుకూలం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి కార్బండజిమ్ 2గ్రా. లేదా థైరమ్ 2 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తాలి. వరుసకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ విత్తుకోవాలి.