News March 29, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. భర్త అనుమానమే కారణమా?

image

SRD జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్‌ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమెపై అనుమానంతో చెన్నయ్య వేధించేవాడు. దీంతో పట్టింటికి వెళ్లింది. పెద్దలు చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చింది. మళ్లీ వేధిస్తే పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లోనే రజిత హెచ్చరించినట్లు తెలిసింది.

Similar News

News November 22, 2025

కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

image

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్‌పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

News November 22, 2025

జనగామ: రేపు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు

image

జనగామ జిల్లాలో ఆదివారం సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీఓ ఆఫీసులో జీఓ 46 ప్రకారం సర్పంచ్‌ స్థానాలకు మహిళా రిజర్వేషన్లు, అన్ని ఎంపీడీఓ ఆఫీసుల్లో వార్డు సభ్యుల స్థానాలకు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతుందని వివరించారు.

News November 22, 2025

గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

image

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో హార్డ్‌‌డిస్క్‌లు, పెన్‌‌డ్రైవ్‌లు ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.