News March 29, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. భర్త అనుమానమే కారణమా?

image

SRD జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్‌ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమెపై అనుమానంతో చెన్నయ్య వేధించేవాడు. దీంతో పట్టింటికి వెళ్లింది. పెద్దలు చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చింది. మళ్లీ వేధిస్తే పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లోనే రజిత హెచ్చరించినట్లు తెలిసింది.

Similar News

News April 20, 2025

రేపు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు

image

USA ఉపాధ్యక్షుడు JD వాన్స్ రేపటి నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 24 వరకు పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. రేపు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో దిగనున్న ఆయనకు క్యాబినెట్ మంత్రి స్వాగతం పలకనున్నారు. ఢిల్లీలోని అక్షర్‌ధామ్, చేనేత ఉత్పత్తుల దుకాణాలు సందర్శించనున్నారు. సా.6.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యి భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై వాన్స్ చర్చిస్తారు.

News April 20, 2025

‘చట్టాలన్ని ఆడవారికే’ .. భార్య టార్చర్‌తో భర్త సూసైడ్

image

భార్య వేధింపులు తాళలేక యూపీలో మోహిత్ కుమార్ అనే ఫీల్డ్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తినంతా భార్య వారి కుటుంబసభ్యుల పేరు మీదకు మార్చాలని, లేకుంటే తనపై వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించిందని తెలిపారు. ప్రస్తుతమున్న చట్టాలన్నీఆడవారికే అనుకూలంగా ఉన్నాయని, మగవారిని రక్షించేలా చట్టాలుంటే తాను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదని వీడియో రికార్డు చేసి ప్రాణాలు వదిలారు.

News April 20, 2025

మెగాస్టార్ మూవీ.. VFX కోసం రూ.75 కోట్లు?

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’లో కీలకంగా ఉన్న VFX కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం వీటి కోసమే UV క్రియేషన్స్ రూ.75 కోట్లు వెచ్చించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సోషియో ఫాంటసీ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులైలో విడుదల కానున్నట్లు సమాచారం.

error: Content is protected !!