News March 12, 2025

సంగారెడ్డి: మున్సిపాలిటీలో 76 LRSల పరిష్కారం: కలెక్టర్

image

మున్సిపాలిటీలో 76, పంచాయితీలో 116 ఎల్ఆర్ఎస్‌లు పరిష్కరించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల 31లోపు పూర్తి చేసుకుంటే 25% రిపేర్ వస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 19, 2025

కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

కర్నూలు రేంజ్‌లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News October 19, 2025

MBNR: మద్యం దుణాకాలను 5,142 దరఖాస్తులు

image

మద్యం దుకాణాల గడువును ప్రభుత్వం 23 వరకు పొడగించింది. నిన్న ఒక్కరోజే 2407 దరఖాస్తులు రావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 227 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటికి 5,142 వచ్చాయి. MBNR 1544, NGKL 1423, NRPT 779, GDWL 723, WNP 673 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. నాన్‌ రిఫండబుల్‌ విధానంలో ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల ఫీజు ఉండటంతో దరఖాస్తులు రాలేదని పలువురు అంటున్నారు.

News October 19, 2025

కేఆర్‌పురం ITDAకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు

image

బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం ఐటీడీఏ రాష్ట్రంలోనే ఉత్తమ ఐటీడీఏగా కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. రాములు నాయక్ OCT 17న న్యూ ఢిల్లీలో నిర్వహించిన “ఆది కర్మయోగి జాతీయ సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ధాత్రి అభ జనభాగిదారి అభియాన్‌లో చేసిన విశేష కృషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఐటీడీఏ అవార్డు లభించినట్లు పీవో తెలిపారు.