News December 10, 2024
సంగారెడ్డి: మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిశీలన: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733813115116_52141451-normal-WIFI.webp)
3నెలలకు ఒకసారి ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం పాత డీఆర్డీఏలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్లో సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు పోలీసుల భద్రత కల్పించినట్లు చెప్పారు.
Similar News
News January 25, 2025
MDK: తగ్గిన ఎయిర్టెల్ సిగ్నల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737768065486_51894734-normal-WIFI.webp)
ఎయిర్టెల్ సిమ్ము వినియోగదారులకు గత కొన్ని రోజుల నుంచి సిగ్నల్ సరిగా అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్టెల్ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఒక సైట్ ఓపెన్ కావడానికి 1 నిమిషం వరకు పడుతోందని యువకులు అంటున్నారు. airtel సిబ్బంది స్పందించలన్నారు.
News January 25, 2025
మెదక్: తగ్గిన కోడిగుడ్ల ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737766500233_51894734-normal-WIFI.webp)
మెదక్ జిల్లా వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు అధికంగా తగ్గాయి. గతంలో రూ.7.50గా పలికిన ఒక్క కోడి గుడ్డు ధర నేడు రూ.5.50లకు పడిపోయింది. ఒక ట్రే రూ.180 ఉండేది. రేట్లు తగ్గడంతో రూ.150కు ట్రే అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడ్లపై మక్కువ ఉన్న ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
News January 25, 2025
జాతీయ ఓటరు దినోత్సవాన్ని జయప్రదం చేయండి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737764498814_50605465-normal-WIFI.webp)
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ నుంచి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలో జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు, జర్నలిస్టులు, ప్రజలు, విద్యార్థుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.