News January 30, 2025

సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

image

సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం PSలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పొక్సో, అట్రాసిటీ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.

Similar News

News February 14, 2025

నీ సంకల్పం గొప్పది బ్రో..!

image

సివిల్ సర్వెంట్ కావాలనేది ఎంతో మంది కల. దీనికి ఎంతో కష్టమైన UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాల్సిందే. కొందరు నాలుగైదు అటెంప్ట్స్‌లో, మరికొందరు ఒక్కసారికే సివిల్ సర్వెంట్ అయిపోతుంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీవాస్తవ(48) ఇప్పటివరకు UPSC, MPPSC కలిపి 73 సార్లు ప్రిలిమ్స్, 43సార్లు మెయిన్స్, 8 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఉద్యోగం పొందలేకపోయారు. ప్రతిసారి నిరాశే ఎదురైనా ప్రిపరేషన్ కొనసాగించారు.

News February 14, 2025

పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీపై కలెక్టర్ స్పందన

image

పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 34కేటగిరీలలో ఖాళీగా ఉన్న 244పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. పోస్టులు అమ్ముకుంటున్నారన్న వదంతులు తన దృష్టికి వచ్చిందని, అటువంటి వదంతులు నమ్మవద్దని, ఎవరూ ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటిఫై చేసిన పోస్టులను రోస్టర్ అనుసరించి మాత్రమే భర్తీ చేస్తున్నామన్నారు.

News February 14, 2025

భీమవరం: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్ లో పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి 31 వరకు 10వ తరగతి రెగ్యులర్ వారికి, 17 నుంచి మార్చి 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతాన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 128 కేంద్రాల్లో 24,393 మంది విద్యార్ధులు హాజరవుతారన్నారు. 

error: Content is protected !!