News February 16, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల సంగారెడ్డిలో ఈ నెల నుంచి 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు నుంచి తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 19, 2025
విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.
News November 19, 2025
రైతులకు గుడ్న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

AP: ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత సాయం రైతుల ఖాతాల్లో జమ కానుంది. 46,85,838 మంది ఖాతాల్లో రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్లను సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. కడప(D) పెండ్లిమర్రిలో మ.2గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు.
News November 19, 2025
2030 నాటికి కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు

మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ద్వారా వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.


