News January 26, 2025
సంగారెడ్డి: రేపటి నుంచే 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-1 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి ఫిబ్రవరి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-1 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 11, 2025
షమీ విషయంలో ఆరోపణలను ఖండించిన BCCI!

షమీని కావాలనే సెలక్ట్ చేయట్లేదన్న ఆరోపణలను ఓ BCCI అఫీషియల్ ఖండించినట్లు PTI పేర్కొంది. ‘షమీ ఫిట్నెస్పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతణ్ని ఇంగ్లండ్ సిరీస్కు పంపేందుకు ప్రయత్నించాం. ఇంగ్లండ్ లయన్స్పై భారత్-A తరఫున అతడిని బరిలోకి దింపితే ఫిట్నెస్పై అంచనా వస్తుందనుకున్నాం. కానీ సిద్ధమయ్యేందుకు షమీ తగిన సమయం కావాలన్నారు. అతణ్ని సంప్రదించలేదన్నది అవాస్తవం’ అని ఆయన చెప్పినట్లు వెల్లడించింది.
News November 11, 2025
వరద బాధిత కుటుంబాలకు ₹12.99 కోట్ల సాయం

TG: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా ₹12.99 కోట్లు అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలు, వరదల్లో 15 జిల్లాల్లో 8662 ఇళ్లు దెబ్బతిన్నట్లు కలెక్టర్లు నివేదికలు పంపారు. ఈ ఇళ్ల యజమానులకు ₹15,000 చొప్పున అందించనున్నారు. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అక్టోబర్ 27-30 వరకు వరుసగా 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలతో ఈ నష్టం వాటిల్లింది.
News November 11, 2025
‘న్యూమోనియా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి’

ఈనెల 12న ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా 12 నుంచి 18 వరకు న్యూమోనియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని DMHO డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ మంగళవారం వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని 64 పీహెచ్సీల పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ తదితర శాఖలతో కలిసి ర్యాలీలు, శిబిరాలు నిర్వహించాలన్నారు. న్యూమోనియా వ్యాధి లక్షణాలు, చికిత్స, నిరోధక చర్యల గురించి ప్రజలకు వివరించాలన్నారు.


