News February 12, 2025
సంగారెడ్డి: రేపు ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలి: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలో రేపు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని సూచించారు.
Similar News
News January 8, 2026
ఆ పోర్నోగ్రఫీ చూసినా, షేర్ చేసినా జైలుకే!

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారిని TG సైబర్ సెక్యూరిటీ బ్యూరో ట్రేస్ చేస్తోంది. వీడియోలను చూస్తూ, షేర్ చేస్తున్న ఓ వ్యక్తిని ఖమ్మం పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ ‘సైబర్ టిప్ లైన్’ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ బ్రౌజింగ్పై పోలీసులకు అలర్ట్స్ పంపిస్తుంటుంది. గతేడాది TGకి 97,556 అలర్ట్స్ వచ్చాయి. 854 FIRలు నమోదవగా, 376 మంది అరెస్టయ్యారు.
News January 8, 2026
నెల్లూరు: బంగారం కోసం హత్య

కొడవలూరు (M) కొత్త వంగల్లు గ్రామంలో ఈనెల 5న ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళ కోటేశ్వరమ్మ హత్యకు గురైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల వెల్లడించారు. కోటేశ్వరమ్మ ఇంటి వరండాలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన వేముల రంజిత్ కుమార్ రాయితో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు సరుడు ఎత్తుకెళ్లాడు. నిందితుడిని అరెస్ట్ చేసి సరుడు రికవరీ చేశారు.
News January 8, 2026
బాపట్లలో సాంప్రదాయ క్రీడా పోటీలు: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వీసీఎండీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 10న సాంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. బాపట్లలోని కేవీకే ఇండోర్ స్టేడియం, మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. సంప్రదాయాలను యువతకు తెలియజేసి మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం పెంపొందించడమే లక్ష్యమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.


