News February 12, 2025
సంగారెడ్డి: రేపు ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలి: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలో రేపు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని సూచించారు.
Similar News
News January 9, 2026
మంచిర్యాల: యాక్సిడెంట్.. డిగ్రీ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లాలోని <<18794592>>మోకిల <<>>వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్కు చెందిన విద్యార్థి దుర్మరణం చెందారు. మంచిర్యాలకు చెందిన దేవుళ్ల సూర్యతేజ HYDలో డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకొని కారులో తిరిగి వస్తుండగా బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
News January 9, 2026
ఈనెల 15 నుంచి సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 21 వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రధాన ఘట్టాల వివరాలు ఇలా ఉన్నాయి:
జనవరి 16: స్వామివారి కళ్యాణోత్సవం
జనవరి 18: సాయంత్రం 4 గంటలకు రథోత్సవం (తేరు)
జనవరి 19: రాత్రి 7 గంటలకు చెరువులో తెప్పోత్సవం
జనవరి 21: హంస వాహన సేవ
ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ కోరింది.
News January 9, 2026
ఇరాన్కు ట్రంప్ వార్నింగ్.. టచ్ చేస్తే రియాక్షన్ గట్టిగా ఉంటుంది!

ఇరాన్ ప్రభుత్వానికి ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులను చంపితే ఊరుకోబోమని, తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ‘ఒకవేళ మీరు ప్రజలను చంపడం మొదలుపెడితే మేం మీపై బలంగా దాడి చేస్తాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇరాన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. తొక్కిసలాట వల్ల కూడా కొందరు చనిపోయి ఉండొచ్చు. కానీ కావాలని హింసకు పాల్పడితే మాత్రం మూల్యం చెల్లించాల్సిందే’ అని ట్రంప్ అన్నారు.


