News February 10, 2025
సంగారెడ్డి: రేపు పది విద్యార్థులకు ప్రేరణ తరగతులు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు టిసాట్ ద్వారా రేపు ప్రేరణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, విషయ నిపుణుల ద్వారా పదో తరగతి విద్యార్థులకు కేరీర్ గైడెన్స్ పైన సలహాలు ఇవ్వడం జరుగుతుందని, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని పాఠశాలల హెచ్ఎంలకు డిఈవో సూచించారు.
Similar News
News March 23, 2025
చంద్రబాబు పర్యటనపై ఎమ్మెల్యే ఏలూరి వీడియో కాన్ఫరెన్స్

ఏప్రిల్ ఒకటిన సీఎం చంద్రబాబు పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన ఏర్పాట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు.
News March 23, 2025
ఎన్టీఆర్: ఆ నిర్ణయంతో వేలాది మందికి చేకూరనున్న లబ్ధి

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్(RTF) కింద రూ.600కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో ఎన్టీఆర్ జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. త్వరలో మరో రూ.400కోట్లు విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు అనుమతించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన Xలో హెచ్చరించారు.
News March 23, 2025
మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్

కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానిక కొండేపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న చదలవాడ పద్మజ (52) ZPH బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటున్నట్లు SI సైదుబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.