News March 19, 2025
సంగారెడ్డి: రేపు పోలీస్ స్టేషన్లకు పది ప్రశ్నాపత్రాలు

పదో తరగతి సెట్-2 ప్రశ్నాపత్రాలు బుధవారం పోలీస్ స్టేషన్లకు చేరుకుంటాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు డబుల్ లాక్డ్ ట్రంక్ బాక్స్లతో ఉదయం 10 గంటలకు సంబంధిత పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News November 28, 2025
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ శ్రీజ పర్యటన

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఆమె ఆసుపత్రిలో జరుగుతున్న సదరం భవన నిర్మాణ పురోగతిని, అలాగే వివిధ సివిల్ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.
News November 28, 2025
4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా నిరసన తెలిపారు.


