News February 9, 2025
సంగారెడ్డి: రేపు భౌతిక, రసాయన శాస్త్రం ప్రతిభా పరీక్ష

పదవ తరగతి విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రం జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష సంగారెడ్డిలోని సైన్స్ కేంద్రంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ప్రతిభా పరీక్షకు హాజరు కావాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.
Similar News
News October 14, 2025
ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్: లోకేశ్

విశాఖలో గూగుల్ <<18002028>>పెట్టుబడుల ఒప్పందం<<>> తర్వాత ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
News October 14, 2025
HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల యువతి మృతి

హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష నగర్కు చెందిన బండారి అశోక్, గీత దంపతుల చిన్నకుమార్తె బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్లో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. HYD గుర్రంగూడలో <<17982838>>రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం<<>>లో కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన మనోజ్ఞను యశోద ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 14, 2025
ఇంజినీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్

రూపా రాహుల్ బజాజ్ స్కాలర్షిప్ మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, మెంటార్షిప్ అందిస్తోంది. ఇంటర్లో 75% మార్కులతో ఇంజినీరింగ్ చదువుతున్నవారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, ఇండస్ట్రియల్/ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్సెస్, మెటలర్జీ బ్రాంచులకు వర్తిస్తుంది. చివరి తేదీ: 31-10-2025. వెబ్సైట్: <