News April 9, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కర్ణాటకలోని బీదర్ జిల్లా ఖానాపూర్లో జరిగిన ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. మినీ బస్సు, బైక్ను ఢీకొట్టడంతో న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన కార్మికులు ఇస్మాయిల్(25), రమేష్(44) మృతి చెందగా.. బసవరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి తర్వాత మరొకరి మృతదేహాలు గ్రామానికి వస్తుండగా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News December 4, 2025
రంగారెడ్డి కలెక్టరేట్లో ACB దాడులు

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
News December 4, 2025
చండూరు: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు బరిలో నిలవడంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కావలి స్వాతి పోటీ చేస్తుండగా, కావలి శివాని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ ఉంటుందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
News December 4, 2025
విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.


