News April 14, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహన యజమాని మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బీదర్ నుంచి తిరుపతికి బేరం కుదుర్చుకుని వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో 12 మందికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Similar News
News April 24, 2025
గద్వాల: ‘అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

జిల్లాకు అవసరమైన వైద్యాధికారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం గద్వాల కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ ,ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
News April 24, 2025
డోర్నకల్: భూ భారతి పోర్టల్ను ప్రారంభించనున్న కలెక్టర్

డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో గురువారం సాయంత్రం 4గం.లకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని భూ భారతి పోర్టల్ను ప్రారంభించనున్నారు. ముఖ్య అతిదులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News April 24, 2025
నిర్మల్: మండిపోతున్న ఎండలు

నిర్మల్ జిల్లా బుధవారం అగ్నిగుండంగా మారింది. అధికారులు వెల్లడించిన ఉష్ణోగ్రతల ప్రకారం 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. తీవ్ర ఉక్కుపోత వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలలోపే భరించలేని ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు అధికారులు ఎండల తీవ్రతపై ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.