News February 3, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్మెన్ మృతి

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే గన్మెన్ మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి(M) బుల్కాపూర్కు చెందిన శ్రీనివాస్(34) పటాన్ చెరు(M) ఎలిమెలలో ఆదివారం బీరప్ప జాతరకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. జాతర ముగించుకుని వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 22, 2025
మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.
News November 22, 2025
యాక్సిడెంట్.. మెదక్ యువకుడు మృతి

HYD శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మెదక్ పట్టణానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణానికి చెందిన కాముని శ్రీనివాస్ కుమారుడు కాముని భారత్ (23) ఈరోజు ఉదయం రింగ్ రోడ్డుపై కారులో వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న మెదక్ కరూర్ వైశ్య బ్యాంకు మేనేజర్ భార్యకు తీవ్ర గాయాలవగా అసుపత్రికి తరలించారు. పట్టణంలో విషాదం అలుముకుంది.
News November 21, 2025
తూప్రాన్: విద్యార్థులు ఇష్టంతో చదవాలి: డీఈవో

పదవ తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ పేర్కొన్నారు. శుక్రవారం తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఎస్ఎస్సీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేకతలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరాలు ఉంటే సహకరిస్తానని, పరీక్షకు అందరూ హాజరై ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.


