News February 3, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్మెన్ మృతి

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే గన్మెన్ మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి(M) బుల్కాపూర్కు చెందిన శ్రీనివాస్(34) పటాన్ చెరు(M) ఎలిమెలలో ఆదివారం బీరప్ప జాతరకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. జాతర ముగించుకుని వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 28, 2025
కోనసీమ: లైసెన్స్ స్లాట్లను మార్చుకోండి..!

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 28, 29, 30, 31వ తేదీల్లో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు వచ్చే వారానికి మార్చుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిటిజెన్ లెవెల్లో స్లాట్స్ మార్చుకునే సదుపాయం తెచ్చామని చెప్పారు.
News October 28, 2025
‘జీర్ణం వాతాపి జీర్ణం’ అని ఎందుకంటారు?

ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు ప్రయాణికులను మోసం చేస్తూ ఉండేవారు. వాతాపి మేకగా మారి, వంటగా వడ్డింపబడి, భోజనం తర్వాత కడుపు చింపుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అగస్త్యుడు ఓనాడు వాతాపిని తిన్నాడు. ఇల్వలుడు వాతాపిని పిలవగా అగస్త్యుడు వాతాపి ఎప్పుడో జీర్ణమయ్యాడంటూ కడుపును రుద్దుతూ ‘జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నాడు. దీని ఆధారంగా తిన్నది బాగా జీర్ణం కావాలని ఇలా చెప్పడం అలవాటుగా మారింది. <<-se>>#DHARMASANDEHALU<<>>
News October 28, 2025
రాబోయే 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాబోయే 2-3 గంటల్లో మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HYD, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, NZB, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.


