News February 11, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

మెదక్ జిల్లా కాట్రియల్ ఉన్నత పాఠశాలలో హిందీ పండితుడు సలావుద్దీన్ సోమవారం పాఠశాల నుంచి విధులు ముగించుకుని వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడని ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. 12 సంవత్సరాలు నార్సింగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్గా పనిచేసి ఇటీవలే పదోన్నతి పొంది కాట్రియల్కు బదిలీ అయ్యాడని తెలిపారు.
Similar News
News March 19, 2025
ఉట్నూర్: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కును రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్ను ఢీ కొన్న చిచ్దరి ఖానాపూర్కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.
News March 19, 2025
నారాయణపేట జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

నారాయణపేట జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లోని తన ఛాంబర్లో హౌసింగ్, డీఆర్డీఏ, విద్యాశాఖ, ఆరోగ్య, పీఆర్, డీపీవో, మున్సిపల్ శాఖల అధికారులతో ఆయా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు గ్రౌండింగ్లో జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉందని, నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు.
News March 19, 2025
పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో వరంగల్ కలెక్టర్ సమీక్ష

సీఈవో ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో అదరపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా ఎలక్ట్రోరల్ డ్రాఫ్ట్ మొత్తం ఓటర్లు 771139 కాగా, అందులో ఆడిషన్స్ 3777, డెలిషన్స్ 2092 ఉన్నాయని ఫైనల్ ఎలక్ట్రానిక్ ఓటర్లు 772824 ఉన్నారన్నారు.