News March 4, 2025
సంగారెడ్డి: రోబోటిక్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామం కన్వెన్షన్ హాల్లో జరిగిన రోబోటిక్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో జిల్లా నుంచి ఏడు పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మొత్తం 11 పాఠశాలలు పాల్గొనగా ఏడు పాఠశాల విద్యార్థులు డైమండ్ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News December 8, 2025
GNT: అలర్ట్..పరీక్షా ఫలితాలు విడుదల

ANU పరిధిలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన బీఫార్మసీ మూడవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు 34.39% ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 19వ తేదీ లోపు రూ. 2,070 నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.
News December 8, 2025
ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.
News December 8, 2025
YCP కక్షపూరిత రాజకీయాలతో ఖజానాకు నష్టం: CM

AP: YCP కక్షపూరిత రాజకీయాలతో గతంలో ప్రజాధనం నష్టమైందని CM CBN విమర్శించారు. ‘PPAల రద్దుతో విద్యుత్ వాడకుండానే ₹9వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. మూలధన వ్యయం లేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఆస్తుల్నే కాకుండా భవిష్యత్తు ఆదాయాన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎంత కష్టమైనా సరే హామీలను నెరవేరుస్తున్నాం. ఆగిన పథకాలను పునరుద్ధరించాం’ అని CM వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.


