News April 14, 2025
సంగారెడ్డి: లారీని ఢీకొని వ్యక్తి మృతి

చౌటకూర్ మండలం శివ్వంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. సంగారెడ్డి నుంచి జోగిపేట వెళ్తున్న లారీని బైక్పై వస్తున్న వ్యక్తి వెనుక నుంచి ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి సందర్శించి పరిశీలించారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 14, 2025
మెదక్: NMMS దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMS) పరీక్ష దరఖాస్తుల గడువు ఈ మంగళవారంతో ముగియనుందని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News October 14, 2025
NLG: వాతవరణం.. వరి పంటకు ప్రతికూలం

ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. జిల్లాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కంకి వెళ్లే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో, మరికొన్ని చోట్ల కంకి వెళ్లి గింజపోసుకునే దశలో ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. వరిపొట్టలోకి నీరు చేరడంతో చీడపీడలు ఎక్కువవుతున్నాయి. కంకి వెళ్లిన పంటలో సుంకు రాలిపోతోంది. కంకి వెళ్లి గింజపోసుకుంటున్న వరి వానలకు నేలవాలుతోంది.
News October 14, 2025
KNR: నాడు YSR-KVP.. నేడు రేవంత్-శ్రీధర్ బాబు

దివంగత YSRకి KVP ఎలా ఆత్మలా ఉండేవారో CM రేవంత్కి మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు అలా ఉంటున్నారనడంలో సందేహం లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ, విదేశీ, 4th సిటీ, పాలనాపరమైన వ్యవహారాలు, ప్రతిపక్షాలను కట్టడి చేయడంలో తన MARK చూపిస్తూ రైజింగ్ TGలో కీరోల్ పోషిస్తున్నారు. శ్రీధర్ బాబు నిర్ణయమంటే CM డెసిషన్ అన్నట్లుగా పరిస్థితులున్నాయి.