News March 9, 2025

సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 14,3 07 కేసులు పరిష్కారం

image

లోక్ అదాలత్‌లో 14,307 కేసులు పరిష్కరించినట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. కొన్ని కేసుల్లో నష్టపరిహారం కూడా ఇప్పించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

వచ్చే 2 రోజులు అధికంగా చలిగాలుల ప్రభావం

image

TG: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రేపు పశ్చిమ, ఉత్తర తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6-9 డిగ్రీలకు, హైదరాబాద్‌లో 7-11 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News November 16, 2025

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న నిరుద్యోగులు

image

కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళా నిరుద్యోగుల పాలిట వరమని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఆదివారం జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ముందుకు సాగాలని సీఎండీ బలరాం సూచించారు. చదువు ఒకటే మనిషి జీవితాన్ని మారుస్తుందని కలెక్టర్ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి పేరు సాధించాలని ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు.

News November 16, 2025

డిసెంబరులో గ్లోబల్ సమ్మిట్: Dy.CM భట్టి

image

తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇది దుబాయ్ ఫెస్టివల్‌ను మించేలా ఉంటుందన్నారు. ఈ సమ్మిట్‌లో 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీ, గచ్చిబౌలి స్టేడియం వంటి వేదికలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.