News April 4, 2024
సంగారెడ్డి: ‘వడదెబ్బకు దూరంగా ఉందాం’

వేసవిలో వేడి గాలులు వచ్చే అవకాశం ఉందన్న వడదెబ్బకు దూరంగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను బుధవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు సాధ్యమైనంత వరకు రావద్దని చెప్పారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశాంక్ దేశ్పాండే పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 20, 2025
చేగుంట: అడవి పంది ఢీకొని ఒకరి మృతి

చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులో బైక్ను అడవి పంది ఢీకొట్టడంతో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న రాత్రి కొండాపూర్ గ్రామానికి చెందిన బొంది భాను(18), తుమ్మల కనకరాజు(27) బైక్ పై రాజుపల్లి నుంచి కొండాపూర్కు వెళ్తున్నారు. పోలంపల్లి శివారులో అడవి పంది అడ్డు రావడంతో ఢీకొట్టి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన భాను చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు.
News April 20, 2025
మానవ తప్పిదాలు, అజాగ్రత్తతోనే ప్రమాదాలు: ఎస్పీ

మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యలయంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ ధరించాలి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, అధిక వేగంతో వాహనం నడపొద్దన్నారు.