News March 18, 2025
సంగారెడ్డి: వరకట్నం వేధింపులకు వివాహిత బలి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాయికోడ్ మండలం నాగన్పల్లికి చెందిన మహేశ్వరి(22)కి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో పెళ్లైంది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించడంతో మనస్తాపం చెందిన మహేశ్వరి సోమవారం ఉదయం ఉరేసుకుంది.
Similar News
News March 18, 2025
మెదక్: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
News March 18, 2025
మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. హవేళిఘనపూర్, మెదక్, పాపన్నపేటలో 40.3డిగ్రీలు, నర్సాపూర్, టేక్మాల్ 40.2, వెల్దుర్తి 39.9, కుల్చారం 39.8, నిజాంపేట్ 39.7, చిన్నశంకరంపేట 39.6, శివ్వంపేట 39.1, చిలపిచెడ్, చేగుంట 39.0, మాసాయిపేట 38.8, రేగోడ్ 38.7, కౌడిపల్లి 38.4, పెద్దశంకరంపేట 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 18, 2025
మెదక్: ఎండిపోతున్న వరి.. రైతుల ఆందోళన

మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో జిల్లాలో చాలాచోట్ల వరిపంటలు ఎండిపోతున్నాయి. నీరందక చేగుంట మండలం పొలంపల్లిలో వరి ఎండిపోతుంది. దీనికి తోడు ఎండలు సైతం ముదరడంతో వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రామంలో దాదాపు 20 ఎకరాల వరి బీటలు బారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.