News March 4, 2025
సంగారెడ్డి: వారం రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య

వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువకుడు మంజీరా నదిలోకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన అనిల్ (21) మూడు రోజులుగా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు వెతికితే మంజీరా నదిలో శవమై కనిపించాడు. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News December 16, 2025
క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1 పోస్ట్.. కడపలో ఇంటి స్థలం

ఆర్టీపీపీకి చెందిన ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం రూ. 2.50కోట్ల నగదు, పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆమెకు గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
News December 16, 2025
గుంటూరులో అదృశ్యం.. హైదరాబాద్లో ప్రత్యక్షం

గుంటూరులో అదృశ్యమైన ఇద్దరు బాలురు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. లాలాపేటకు చెందిన రెహమాన్ బాషా, నరసరావుపేటకు చెందిన జవాద్ మల్లారెడ్డి నగర్ మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఫంక్షన్ వచ్చి ఈ నెల 14న అదృశ్యమయ్యారు. అయితే రహమాన్ బాషా తల్లిదండ్రులు గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉంటున్న తల్లి వద్దకు రహమాన్ తన స్నేహితుడు జావాద్ని కూడా వెంట పెట్టుకొని వెళ్లాడు.
News December 16, 2025
వనపర్తిలో 17న మూడో విడత ఎన్నికలు

వనపర్తి జిల్లాలో ఈ నెల 17న (బుధవారం) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పానుగల్, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లో జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


