News February 24, 2025
సంగారెడ్డి: వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా వారణాసి వద్ద టిప్పర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి(46), ఆయన భార్య విలాసిని (40), న్యాల్ కల్ మండలం మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
కరీంనగర్: 24/7 తాగునీరు రావట్లే..!

ప్రజారోగ్య శాఖ అధికారుల అలసత్వంతో కరీంనగర్ పట్టణ ప్రజలకు 24/7 తాగునీరు అందడం లేదు. ఎల్ఎండీలో 23 టీఎంసీల నీరున్నా తాగునీటి సరఫరా ఎందుకు చేయడం లేదని నగరవాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి గంట మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో 13వేల నల్లా కనెక్షన్లు ఉండగా 60వేల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అమృత్- 2 పథకంలో భాగంగా పట్టణమంతటా పైప్లైన్ల నిర్మాణం పూర్తయింది.
News September 15, 2025
విజయవాడలో ఇంటింటికీ మెడికల్ కిట్లు

న్యూ RRపేటలో డయేరియా కేసులు పెరగడంతో ప్రభుత్వం అక్కడ ప్రతి ఇంటికీ ఉచితంగా మెడికల్ కిట్లను పంపిణీ చేస్తోంది. ఈ కిట్లో రోగ నిరోధక శక్తిని పెంచే జింక్ టాబ్లెట్తో పాటు, బ్యాక్టీరియాను నివారించే మూడు రకాల మందులు, ORS ప్యాకెట్లు ఉన్నాయి. 2 లక్షల మెడికల్ కిట్లను పంపిణీ చేసి, వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. వీటితో పాటు హైజిన్ కిట్లను కూడా VMC అధికారులు పంపిణీ చేస్తున్నారు.
News September 15, 2025
ములుగు: మేడారం మహా జాతర రోడ్ మ్యాప్ పరిశీలన

సమ్మక్క- సారలమ్మ మేడారం మహా జాతరకు సంబంధించిన రోడ్ మ్యాప్లను మంత్రి సీతక్క ఆదివారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ శబరీష్తో కలిసి ద్విచక్రవాహనంపై జాతర జరిగే ప్రాంతాలను ఆమె కలియతిరిగారు. మహా జాతరకు ఆరు నెలల ముందే రోడ్డు పనులు, కలవర్టు పనులను ప్రారంభించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.