News February 20, 2025

సంగారెడ్డి: విద్యార్థినిలు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి: కలెక్టర్

image

విద్యార్థినిలు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాలలో విపణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో విద్యార్థినిలు మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణ బాయి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

జగిత్యాల: ‘ప్రజా భద్రతలో హోం గార్డులది కీలక పాత్ర’

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో 63వ హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్, ఎన్నికలు, నైట్ పెట్రోలింగ్, నేర నిరోధం, విపత్తు నిర్వహణలో హోం గార్డుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. కళాబృందం అవగాహన కార్యక్రమాలను అభినందించారు. హోం గార్డుల సంక్షేమం కోసం భత్యాల పెంపు, బీమా, రెయిన్ కోట్లు, జాకెట్లు పంపిణీ చేశారు. ఉత్తమ సిబ్బందికి బహుమతులు అందజేశారు.

News December 6, 2025

ప్రైవేటు బిల్లులు.. చట్టాలుగా మారుతాయా?

image

సాధారణంగా పార్లమెంటులో మంత్రులు బిల్లులను ప్రవేశపెడతారు. కానీ ఏదైనా తీవ్రమైన అంశం చట్టంగా మారాలని భావిస్తే ఎంపీలూ <<18487853>>ప్రైవేటు<<>> బిల్లులను ప్రతిపాదించవచ్చు. దీనికి ఒక నెల ముందు స్పీకర్, ఛైర్మన్‌కు నోటీసు ఇవ్వాలి. 1952 నుంచి 300కు పైగా ప్రైవేటు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. అయితే 14 బిల్లులే చట్టాలుగా మారాయి. వాటిలో ముస్లిం వక్ఫ్, ఇండియన్ రిజిస్ట్రేషన్, హిందూ వివాహం(సవరణ), IPC(సవరణ) బిల్లులు ముఖ్యమైనవి.

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

image

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.