News January 31, 2025

సంగారెడ్డి: ‘విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలి’

image

సంగారెడ్డిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ఉన్న బియ్యం, కూరగాయలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దేవదాస్, RCO గౌతమ్ పాల్గొన్నారు.

Similar News

News January 10, 2026

KMM: చిరుత దహనంపై ‘నిశ్శబ్ద’ దర్యాప్తు.. నిందితులెవరు?

image

ఖమ్మం జిల్లా పులి గుండాల అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం దహనం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఉదంతంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ, విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. అసలు ఏడాది కాలంగా ఈ విషయాన్ని ఎందుకు దాచారు? చిరుత గోళ్లు, చర్మం ఏమయ్యాయి? అనే ప్రశ్నలు మిస్టరీగా మారాయి. అటవీశాఖలో అధికారుల మార్పులు జరుగుతున్నా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News January 10, 2026

నెల్లూరు: భారీ పరిశ్రమ.. వెయ్యి ఉద్యోగాలు

image

నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో సెజ్‌లో భారీ పరిశ్రమ రానుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రూ. 6,675 కోట్లతో 200 ఎకరాల్లో ఇంగోట్, వేఫర్ల తయారీ యూనిట్ పెట్టనుంది. దీని ద్వారా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కోసం 200 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ సైతం నెలకొల్పనున్నారు. కనిగిరి రిజర్వాయర్ నుంచి రోజుకు 12.6మిలియన్ లీటర్ల నీటిని కేటాయిస్తారు. 6నెలల్లోనే భూముల కేటాయిపు పూర్తి చేస్తారు.

News January 10, 2026

మంచిర్యాల: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత భైదు

image

అనుమానంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసిన మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య శుక్రవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. 2023లో రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో భార్య జ్యోతిపై దాడి చేయగా, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటి ఎస్సై తహసినోద్దీన్ సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.