News January 31, 2025
సంగారెడ్డి: ‘విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలి’

సంగారెడ్డిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ఉన్న బియ్యం, కూరగాయలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దేవదాస్, RCO గౌతమ్ పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
నన్ను కొట్టడానికి రూ.10 లక్షల డీల్: రేగా

బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కొట్టడానికి కొందరు రూ.10 లక్షల డీల్ మాట్లాడినట్లు SMలో ఆరోపించారు. మణుగూరు అంబేడ్కర్ సెంటర్లో ఈరోజు సాయంత్రం ఎదురుచూస్తానని, తనను కొట్టేవారికి రూ.10 లక్షలు వస్తాయంటే నేను దెబ్బలు తినడానికి రెడీ అని ప్రకటించారు. తన వల్ల ఒక కుటుంబం బాగుపడుతుందని తెలిపారు.
News November 6, 2025
లోకేష్ పర్యటనలో టోల్ గేట్ వరకే పరిమితమైన కావలి MLA !

మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గ పర్యటనలో MLA కృష్ణారెడ్డి పాత్ర కేవలం ముసునూరు టోల్ గేట్ వరకు మాత్రమే పరిమితమైంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ వెంట MLA దగదర్తికి వెళ్లలేదు. MLA కావ్యకు టీడీపీ నేత మాలేపాటికి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. కావ్య రాకను మాలేపాటి అనుచరులు, అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఆయన టోల్ గేట్ వరకే పరిమితమయ్యారని సమాచారం.
News November 6, 2025
GWL: నిజాయితీ చాటుకున్న మహిళలు..!

గద్వాల పట్టణంలోని బాలికల పాఠశాల ముందు రోడ్డుపై పడి ఉన్న రూ.5 వేలను అటుగా వెళుతున్న ముగ్గురు మహిళలు గుర్తించారు. వాటిని తీసుకొని సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎస్సై బాలచంద్రుడును కలిసి తమకు రూ.5 వేలు దొరికాయని చెప్పి నగదు అందజేశారు. దీంతో ఎస్ఐ వారిని ప్రశంసించి అభినందించారు. డబ్బులు పోయిన వారు సంబంధిత సమాచారంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.


