News February 26, 2025
సంగారెడ్డి: విద్యుత్ కాంతుల్లో కాశీ విశ్వేశ్వర ఆలయం

కాకతీయుల కాలంలో నిర్మించిన సంగారెడ్డి మండలం కల్పగురు గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 26వ తేదీన ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
బిజినేపల్లి అత్యధిక వర్షపాతం నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా బిజినేపల్లి మండల కేంద్రంలో 70.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యంగంపల్లి 48.5, కొండారెడ్డిపల్లి 45.0, పాలెం 35.5, మంగనూర్ 32.8, తెలకపల్లి 29.5, కిష్టంపల్లి 17.0, తోటపల్లి 15.0, ఉప్పునుంతల 7.5, కొల్లాపూర్ 11.3, లింగాల 6.8, ఐనోల్ 6.5, కల్వకుర్తి 3.0, ఊర్కొండ 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
News September 14, 2025
NRPT: చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం

అంతిమంగా ఉచిత చేప పిల్లల సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేప పిల్లల పెంపకం కేంద్రాల నిర్వహకులకు జరిపిన సాంకేతిక నైపుణ్యం,నాణ్యత నిర్దేశాలకు అనుగుణంగా నారాయణపేట జిల్లాకు ఒక్కరే బిడ్ దాఖలు చేసినప్పటికీ గత్యంతరం లేక అధికారులు ఆమోదం తెలిపారు. గత నెలలోనే చెరువులు నిండుకున్న నేపథ్యంలో పంపిణీ ఆలస్యం అయిన తరుణంలో చేప పిల్లల సైజు, నాణ్యత ప్రమాణాలు పాటించడం ఇబ్బందికరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News September 14, 2025
తురకాపాలెం వరుస మరణాలకు కారణం యురేనియం?

తురకాపాలెంలో మరణమృదంగం కలకలం రేపింది. ఐతే మరణాలకు గల కారణాలు ఆ ప్రాంతంలోని యురేనియం అవశేషాలే అన్నట్లుగా చెన్నై ప్రయోగశాల నిర్ధారణ చేసినట్లుగా తెలిసింది. ఇటీవల నమూనాలను సేకరించి చెన్నై ల్యాబ్కు పంపగా ఈ విషయం వెల్లడైంది. ఆ ప్రాతంలో క్వారీలు ఉండటంతో అక్కడ నీటిని పలు సమయాల్లో వాడటంతోనే సమస్య ఏర్పడిందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గతంలో అధికారులు తెలిపిన వాటికి చెన్నై రిపోర్టు భిన్నంగా ఉంది.