News February 26, 2025

సంగారెడ్డి: విద్యుత్ కాంతుల్లో కాశీ విశ్వేశ్వర ఆలయం

image

కాకతీయుల కాలంలో నిర్మించిన సంగారెడ్డి మండలం కల్పగురు గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 26వ తేదీన ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 23, 2025

నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

image

నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. MLG, వేములపల్లి, తిప్పర్తి, హాలియా, NDMNR, కనగల్, మునుగోడు, NKL ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు. 

News March 23, 2025

భగ్గుమంటున్న వనపర్తి

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా విలియంకొండ 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దమందడి 37.7, పెబ్బేరు 37.6, గోపాల్ పేట 37.5, దగడ 37.5, మదనాపూర్ 37.5, కానాయిపల్లి 37.4, ఆత్మకూర్ 37.2, కేతపల్లి 37.2, పానగల్ 37.1, రేమద్దుల 36.9, ఘన్పూర్ 36.7, వెలుగొండ 36.6, వనపర్తి 36.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 23, 2025

ఖమ్మం: రెండో రోజు 34 మంది విద్యార్థుల గైర్హాజరు

image

ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం పదో తరగతి హిందీ పరీక్షకు 34మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ తెలిపారు. మొత్తం 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎనిమిది పరీక్ష కేంద్రాలను డీఈవో, 37 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.

error: Content is protected !!