News April 13, 2025

సంగారెడ్డి: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పుల్కల్ మండలం మిన్ పూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో పొలం వద్ద రైతు రమావత్ రమేష్(33) శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. గాలి వాన బీభత్సం రావడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కరెంటు సరఫరా పునరుద్ధరించలేదని అధికారులు చెప్పడంతో రైతు రమేష్ శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లగా అక్కడే విద్యుత్ షాక్‌తో మరణించినట్లు తెలిపారు. ఈ నెల 16న రమేష్ సోదరుడి పెళ్లి జరగాల్సి ఉండగా విషాదం నెలకొంది.

Similar News

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.

News December 13, 2025

మంత్రి సంధ్యారాణిని కలిసిన మన్యం డీఈవో

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఈవో‌గా బాధ్యతలు స్వీకరించిన పి.బ్రహ్మాజీరావు శనివారం మంత్రి సంధ్యారాణిని సాలూరు క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవంతో జిల్లాను విద్యారంగంలో మరింత ప్రగతి సాధించేలా కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్ మంత్రిని కలిశారు.

News December 13, 2025

అల్లూరి జిల్లాలో పెరిగిన టమాట ధర..?

image

అల్లూరి జిల్లాలో టమాటా ధరకు రెక్కలు వచ్చాయి. అడ్డతీగల, రాజవొమ్మంగి, కొయ్యూరు, చింతపల్లి మండలాల్లో శనివారం రిటైల్‌గా కిలో రూ. 80 చొప్పున విక్రాయించారని వినియోగదారులు తెలిపారు. గత వారం రూ.60 ఉండగా ప్రస్తుతం రూ. 20 పెరిగిందన్నారు. ఈ ప్రాంతంలో అకాల వర్షాలు వలన టమాటా పంట దెబ్బ తినడంతో రాజమండ్రి, నర్సీపట్నం నుంచి అల్లూరికు తీసుకొచ్చి విక్రయిస్తున్నామని వ్యాపారులు అంటున్నారు.