News February 19, 2025
సంగారెడ్డి: వేసవి త్రాగునీటి ప్రణాళికలు తయారు చేయాలి: కలెక్టర్

జిల్లాలో రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నివేదికలు తయారు చేయాలని చెప్పారు. ఎక్కడైనా పైప్ లైన్ల రిపేర్లు ఉంటే మరమ్మత్తులు చేయాలని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
NGKL: ఎస్పీ పేరుతో ఫేక్ అకౌంట్..

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ సృష్టించారు. సైబర్ నేరగాళ్లు ఈ ఫేక్ అకౌంట్ ద్వారా మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా మెసేజ్ వస్తే స్పందించొద్దని ఎస్పీ కోరారు.
News September 18, 2025
నాగాయలంక: పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం.. అసలేమైంది.!

నాగాయలంక (M) నాలి గ్రామానికి చెందిన నాయుడు డానియేల్ బాబు (19) గత నెల 28న అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, డానియేల్ తల్లి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ DSP విద్యాశ్రీ, తహశీల్దార్, సీఐ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
News September 18, 2025
పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

సంతకవిటి పోలీస్ స్టేషన్లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.