News January 31, 2025
సంగారెడ్డి: శనివారం జరిగే దివ్యాంగుల ప్రజావాణి రద్దు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతినెల మొదటి శనివారం జరుగే దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వయోవృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్జెండర్స్ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని అందుకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల అనంతరం తిరిగి ప్రజావాణిని నిర్వహిస్తామని వివరించింది.
Similar News
News October 24, 2025
పారాది వద్ద రాకపోకలకు అంతరాయం

ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురవడంతో వేగవతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పెరగడంతో బొబ్బిలి మండలం పారాది కాజ్వే పైనుంచి వరదనీరు పారుతోంది. దీంతో వాహనాలు రాకపోకలను నిలిపి వేశారు. వాహనాలు రాకపోకలు ఆగిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బస్సులు, మినీ వాహనాలకు పాత వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చారు.
News October 24, 2025
పసుపును అంతర పంటగా ప్రోత్సహించాలి: తుమ్మల

పామాయిల్ సహా ఇతర పంటల్లో పసుపును అంతర పంటగా సాగుకు చర్యలు తీసుకోవాలని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అధిక నాణ్యత గల పసుపు రకాలను రైతులకు అందించి వాటి సాగును ప్రోత్సహించాలన్నారు. మంత్రి తుమ్మలను కలిసిన జాతీయ పసుపుబోర్డు కార్యదర్శి భవానిశ్రీ గత ఆరు నెలల్లో బోర్డు పనితీరును వివరించారు. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, గ్రైండర్లను రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
News October 24, 2025
ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం హెచ్చరికలు

కర్నూలు(AP) <<18087387>>బస్సు ప్రమాద<<>> ఘటనపై విచారణకు ఆదేశించామని TG మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సుల ఫిట్నెస్, ఇతర అంశాల్లో రూల్స్ పాటించకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని ప్రైవేట్ ట్రావెల్స్ను హెచ్చరించారు. ‘తనిఖీలు చేస్తే వేధింపులని అంటున్నారు. ఇవి వేధింపులు కాదు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే యాక్షన్’ అని చెప్పారు. ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామని అన్నారు.


