News January 25, 2025

సంగారెడ్డి: శిథిల భవనాల్లో తరగతులు నిర్వహించొద్దు: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలోని శిథిలావస్థలో ఉన్న అంగన్వాడి, పాఠశాలల్లో తరగతులు నిర్వహించకూడదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న అంగన్వాడి పాఠశాల భవనాల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ గదులు చూసి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని సూచించారు.

Similar News

News January 5, 2026

రెవెన్యూ క్లినిక్‌లను సమర్ధంగా నిర్వహించాలి: బాపట్ల కలెక్టర్

image

రెవెన్యూ క్లినిక్‌లు సమర్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని కలెక్టర్ ప్రకటించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

News January 5, 2026

ASF: ‘అటవీ గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాలి’

image

ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుడిమేత విశ్వనాథ్ కోరారు. ఈమేరకు కలెక్టర్ వెంకటేష్ దోత్రేను కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజన గ్రామాలకు రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ఈనెల 11న మార్లవాయిలో జరిగే హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి సభ ఏర్పాట్లకు సహకరించాలని విన్నవించారు.

News January 5, 2026

ఎవరో ఎందుకు.. సమస్యను మనమే పరిష్కరించుకోలేమా?

image

AP-TG మధ్య నదీ జలాల వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటుచేయగా, నల్లమల సాగర్‌పై ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. అయితే తెలుగువారి ఆత్మగౌరవమంటూ బీరాలు పలికే నాయకులు, మేధావులు కూర్చుని ఓ పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? ఢిల్లీవాళ్లే వివాదాన్ని తేల్చాలా? కడలిపాలయ్యే నీళ్లను ఉపయోగించుకునే తెలివితేటలు మనకు లేవా? సమాధానం చెప్పేదెవరు?